భర్తను కాకుండా మరొకరిని తలుచుకుంటూ అలా ఫీల్ అవుతున్న యాంకర్ అనసూయ…

బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమా లో నటించి వెండి తెర ప్రేక్షకులను అల్లరించింది. అలానే వెండితేర అవకాశాల కోసం జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అనసూయ ఒకవైపు కేరిర్ ని, ఇంకోవైపు ఫ్యామిలీ ని బాగా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది.


తాజాగా అనసూయ అమెరికా వెళ్ళింది. అక్కడ కూడా గ్లామర్ పంట పండిస్తూ రెచ్చిపోతుంది. దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే పెళ్లి రోజు సందర్బంగా భర్తతో కలిసి విదేశాలకి వెళ్లి ఎంజాయ్ చేసింది. దానికి సంబందించిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకొని వారిని ఖుషి చేసింది. ఆ ఫొటోస్ గురించి చాలా మంది రకరకాలుగా స్పందించారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఫ్యామిలీతో కలిసి అమెరికా చెక్కెసింది. అందులో భాగంగా ఒక ప్రదేశంలో అనసూయ గుర్రాలతో కాస్త సమయం గడుపుతుంది. ఈ సందర్బంగా అనసూయ ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘ గుర్రాలతో మాట్లాడం, గడపడం చాలా సంతోషంగా ఉంది. జంతువుల్లో అత్యంత విశ్వాసమైనవి గుర్రాలు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ సమయం లో నాకు నా తండ్రి గుర్తు వస్తున్నాడు.  ‘ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమా లో నటిస్తుంది.