న‌మ్ర‌త చేసిన ప‌నికి చెంప పగ‌లగొట్టిన మ‌హేష్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందో తెలుసా?

టాలీవుడ్ లవ్లీ క‌పుల్స్ లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. నమ్రతా శిరోద్కర్ జంట ఒక‌టి. వంశీ మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. దాదాపు ఏదేళ్ల పాటు ప్రేమించుకున్న మ‌హేష్ బాబు, న‌మ్ర‌త.. 2005 ఫిబ్రవరి 10న ముంబైలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. న‌మ్ర‌తో ఏడుడుగులు వేశాక‌ మ‌హేష్ బాబు కెరీర్ మ‌రింత ఊపందుకుంది. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు.

అయితే పెళ్లి అనంతరం వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే నమ్రత మాత్రం సినిమాలకు గుడ్‌ బై చెప్పేసి గృహిణిగా మారింది. మ‌హేష్, న‌మ్ర‌త దంప‌తుల‌కు గౌత‌మ్‌, సితార జ‌న్మించారు. పెళ్లై రెండు ద‌శాబ్దాలు అవుతున్నా అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఈ జంట ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అలాగే ఒక‌రిపై ఒక‌రికి ఎంత‌టి ప్రేమ ఉన్నాస‌రే.. దాంప‌త్య జీవితంలో చిక్కులు, చికాకులు రావ‌డం కామ‌న్‌. అయితే ఓసారి న‌మ్ర‌త చేసిన ప‌నికి మ‌హేష్ బాబుకు చాలా కోపం వ‌చ్చింద‌ట‌. ఆ కోపంతోనే భార్య చెంప ప‌గ‌ట‌గొట్టాడ‌ట‌. అంత కోపం రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది.

గౌతమ్ క‌డుపులో ఉన్న‌ప్పుడు నమ్రత హెల్త్ ప‌రంగా అనేక ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేసింద‌ట‌. ఆమె బరువు చాలా తక్కువ ఉండటం వల్ల ప్రెగ్నన్సీ లో కాంప్లికేషన్స్ వచ్చాయట. ఈ క్ర‌మంలోనే ఆమె డిప్రెష‌న్ కు లోనై.. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేద‌ట‌. అలా డిప్రెషన్ లో ఉంటే తల్లి కి, క‌డుపులో బిడ్డకి ప్రమాదకరం అని డాక్టర్లు మహేష్ బాబు కి తెలిపారట. దాంతో న‌మ్ర‌త‌ను మ‌ళ్లీ మామూలుగా మార్చ‌డానికి మ‌హేష్‌ ఎంతో ప్ర‌య‌త్నించాడ‌ట‌. అయినాస‌రే న‌మ్ర‌త అలానే త‌ర‌చూ బాధ‌ప‌డుతూ ఉండేద‌ట‌. దాంతో ఓ రోజు మ‌హేష్ బాబు బాగా కోపం వ‌చ్చి న‌మ్ర‌త‌ను చెంప‌పై లాగిపెట్టి ఒక్క‌టిచ్చాడ‌ట‌. ఇక అప్పుడు న‌మ్ర‌త త‌న త‌ప్పును తెలుసుకుంద‌ట‌. మ‌హేష్ బాబు కొట్టాకే నమ్రత మైండ్ స్టేబుల్ అయ్యిందట. ఈ విష‌యాన్ని న‌మ్ర‌త ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించింది.