మరో ఛాలెంజింగ్ రోల్ కి సిద్ధమైన శ్రీదేవి తనయా.. సక్సెస్ అవుతుందా?

అతిలోక సుందరి అందాల తార దివంగత నటీమణి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మరణం తర్వాత ఆమె వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ బాలీవుడ్ యంగ్ బ్యూటీగా మంచి పేరు దక్కించుకోవడమే కాదు కెరియర్ ఆరంభంలోనే సాహసోపేతమైన రోల్స్ కి కూడా సై అంటూ భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది. ఇప్పటికే మాజీ వైమానిక దళ అధికారి గుంజన్ సక్సేనా జీవిత కథలో నటించిన ఈ ముద్దుగుమ్మ. ఆ పాత్ర కోసం భారీ స్థాయిలో కష్టపడిందనే చెప్పాలి.

అంతేకాదు ఫైలెట్ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న ఈమె గుంజన్ లాగే నటించడానికి ఎంతో శ్రమించింది. అప్పటివరకు ఏ సినిమా కోసం కూడా కష్టపడని ఈమె ఈ సినిమా కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినా ఈ సినిమా విజయం సాధించకపోయినా సరే జాన్వి కష్టానికి మాత్రం తగిన గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే మరో ఛాలెంజింగ్ పాత్ర చేయడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రలో సుధాన్స్ సరియా దర్శకత్వంలో ఉలఝ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఆమె రీవీల్ చేస్తూ కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇకపోతే ఈ సినిమాలో జాన్వి కపూర్ ఐఎఫ్ఎస్ అధికారిణి పాత్రలో నటిస్తోంది. దేశభక్తి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ కథ ఇది.. అధికారిణి గా ఉన్న ఆమె ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంది? వంటి విషయాలను ఇందులో ప్రధానంగా చర్చించబోతున్నారు. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)