వనిత విజయ్ కుమార్ ఈమె సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె.. ఈమె తన తండ్రి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించింది. ఈ మధ్యనే మళ్లీ పెళ్లి అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ పరిచయమైంది. తరచూ ఈమె ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఈమెకి మూడు పెళ్లిళ్లు జరిగాయని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించేవి. అయితే మూడో భర్త పీటల్ పాల్ ఈ ఏడాది మే నెలలో చనిపోయిన సంగతి తెలిసిందే అయితే నాకు అతనితో పెళ్లి కాలేదు. అంటూ అప్పట్లో పోస్ట్ పెట్టగా అది సంచలనంగా మారింది..అదేంటి లాక్ డౌన్ టైం లో మీరు పెళ్లి చేసుకున్నారు కదా అని ఒక యాంకర్ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలపై ఆమెనే స్వయంగా క్లారిటీ ఇచ్చింది.
తాజాగా వనిత విజయ్ తన మూడో పెళ్లి గురించి కొన్ని వ్యాఖ్యలను చేశారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ నాకు లాక్ డౌన్ లో చాలా భయం వేసి ఒత్తిడి పెరిగింది..ఆ టైంలో నాకంటూ ఎవరైనా ఉండాలి అనిపించింది. నేను చనిపోయేంత వరకు అయినా నా దగ్గర ఉంటారు కదా అనే ఆలోచనతో మూడో పెళ్లికి రెడీ అయ్యాను అలాగే పీటర్ పాల్ చాలా మంచి వ్యక్తి ఆయన వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ నాకు పెళ్లి జరగలేదు ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. కానీ కొన్నాళ్లకు ఆయన వేరే దారి వెతుక్కున్నాడు.నాకు ఇరువైపుల నుంచి ప్రేమ కావాలి కానీ మాకు అది దక్కలేదని తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.