బేబీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నుంచి తాజాగా వచ్చిన ట్రైయాంగిల్ హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ ఇది. ఇందులో వైష్ణవ్ చైతన్య హీరోయిన్ గా నటిస్తే.. విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు కీలక పాత్రలను పోసించారు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు.
జూలై 14న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా చూసిన వారంతా హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుకుంటున్నారు. తొలి సినిమా అయినప్పటికీ ఆమె ఎంతో అద్భుతంగా చేసింది. మంచి స్కోప్ ఉన్న పాత్రలో ఇరగదీసింది. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య గురించి అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి.
టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యి.. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుని.. వెండితెరపై చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఫైనల్ గా బేబీ మూవీలో హీరోయిన్ గా మారింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అన్నట్లు వైష్ణవి చైతన్య ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. రూ. 700. అవును, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఒక టీవీ ఈవెంట్ లో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినందుకు గానూ వైష్ణవి చైతన్యకు రూ. 700 ఇచ్చారట. ఇండస్ట్రీలో అదే తన ఫస్ట్ పారితోషికం అని వైష్ణవి పేర్కొంది.