సాధారణంగా హీరోలు చాలా మంది సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే . ఇప్పుడు ఈ హీరోలే కాదు హీరోయిన్లు కూడా బిజినెస్ రంగంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. ఇక వారి గురించి ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.
రకుల్ ప్రీత్ సింగ్:
స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇక ఈమెకు ఫిట్నెస్ పై ఎంత ఇష్టం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇష్టంతోనే మెట్రో సిటీస్ లో జిమ్ సెంటర్ ను ఓపెన్ చేసి భారీగా సంపాదిస్తోంది.
శృతిహాసన్:
ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఒక ప్రొడక్షన్ హౌస్, షార్ట్ ఫిలిమ్స్ , యానిమేషన్ ఫిలిమ్స్, వీడియో రికార్డింగ్ సంస్థను స్థాపించింది.
తాప్సీ పన్ను:
తాప్సి కూడా తన సిస్టర్ షాగన్, ఫ్రెండ్ ఫరాహ్ తో కలిసి వెడ్డింగ్ ప్లానర్ గా రాణిస్తోంది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్ళను చాలా గ్రాండ్గా చేస్తోంది..
తమన్నా:
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా కూడా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వైట్ అండ్ గోల్డ్ పేరుతో సొంత ఆభరణాల సంస్థను స్థాపించింది. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది.
ప్రణీత సుభాష్:
కన్నడ ముద్దుగుమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగులో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టిన ఈమె బెంగళూరులో ఒక రెస్టారెంట్ ను మొదలుపెట్టి భారీగా డబ్బు సంపాదిస్తోంది. ఇంకా అక్కడ క్లిక్ అవ్వడంతో చెన్నై , హైదరాబాదులో తన రెస్టారెంట్ బ్రాంచ్ లను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యింది.