వారిని తలచుకుంటూ ఒకేసారి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..

ఒకప్పటి హీరోయిన్ అంకిత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటి తరానికి మాత్రం అంకిత వెంటనే గుర్తుకు రావడం కష్టం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా భూమిక, అంకిత నటించారు. ఈ సినిమా పేరు చెప్పగానే అంకిత ఎవరో గుర్తు వచ్చే ఉంటుంది. సింహాద్రి సినిమాలో అంకిత తన నటనతో అదరగొట్టేసిందనే చెప్పాలి. హరికృష్ణ నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంకిత. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఖతర్నాక్ ‘ సినిమాలో నటించింది. అలానే బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ ‘సినిమాలో కూడా నటించింది. అ తరువాత కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆపై అంకిత సడన్ గా సినిమాలకు దూరం అయిది. ఆమె ఇండస్ట్రీకి దూరం అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేసారు.

ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్ పై కనపడక చాలకాలం అయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కనపడి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. అంకిత తాను ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను చెప్తూ ‘విజయేంద్ర వర్మ సినిమాపై నేను ఎన్నో ఆశాలు పెట్టుకున్నాను. ఈ సినిమా తరువాత మంచి ఆఫర్స్ వస్తాయని అనుకున్నాను. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు.

అందుకే నేను ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది’ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో తన మంచి స్నేహితులు ఇద్దరే అని అంకిత చెప్పింది. ఆ ఇద్దరిలో ఒకరు కూడా ఈ లోకంలో లేరని ఆమె కంటతడి పెట్టింది. ఆమె స్నేహితులు అయిన ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినందుకు అంకిత చాలా బాధపడుతుంది. ప్రస్తుతం అంకిత మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.