బ్రో ప్రి రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ రాకపోవడానికి కారణం..!!

డైరెక్టర్ సముద్రఖని, పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రో.. ఈ చిత్రం రేపటి రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా అయిన వినోదయ సీతం అనే చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండనే పద్యంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం.

Bro release date | Vaartha Pipa News - PiPa News

బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు.. అయితే ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ హాజరయ్యారు. అలాగే వరుణ్ తేజ్ వైష్ణవ తేజ్ కూడా గెస్ట్లుగా రావడం జరిగింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈవెంట్ కు త్రివిక్రమ్ హాజరు కాలేదు.. పవన్ సినిమా అంటే కచ్చితంగా త్రివిక్రమ్ హాజరవుతూ ఉంటారు. కానీ స్క్రీన్ ప్లే అందించినప్పటికీ పవన్ కళ్యాణ్ వెంట త్రివిక్రమ్ రాకపోవడంతో అభిమానులు పలు రకాల అనుమానాలను తెలియజేస్తున్నారు.

Trivikram's shocking remuneration for #SSMB28 revealed..? -  TeluguBulletin.com

పవన్ కళ్యాణ్ కూడా తన మాటలతో త్రివిక్రమ్ పొగుడుతూ ఉండేవారు. అయితే త్రివిక్రమ్ రాకపోవడానికి కారణం ఉందనే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ కుటుంబంతో కలిసి లండన్ లో ఉన్నారు. అయినప్పటికీ ఈ షూటింగ్ మాత్రం ఆగకుండా మహేష్ లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే త్రివిక్రమ్ బ్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని వార్తలు ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఎంత వరకు నిజమో చూడాలి మరి.