తనకు జరిగిన చేదు అనుభవం పై ఓపెన్ అయిన తేజస్వి మదివాడ..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. తెలుగులో బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఎన్నో చిత్రాలలో కూడా నటించింది.ముఖ్యంగా ఇప్పుడు హాట్ అందాలతో అల్లరితో కుర్రకారులలో మంచి క్రేజీ సంపాదించుకుంది. ఐస్ క్రీమ్ ,జత కలిసే తదితర చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ అందాలతో అదరగొట్టేసింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.

Tejaswi Madivada - A Bigg Boss Telugu 2 Contestant, Has Now Given Her Know  To Bigg Boss Telugu OTT

గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తేజస్వి మదివాడ తనకు ఇండస్ట్రీలో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి తెలియజేయడం జరిగింది. తేజశ్రీ మాట్లాడుతూ.. ఒక ఈవెంట్ కి వెళ్లి వస్తున్నప్పుడు సుమారుగా 30 మంది ఫుల్లుగా తాగొచ్చి తన పైన రాత్రి సమయంలో అటాక్ చేశారని ఆరోజు తాను ఏదో విధంగా తప్పించుకొని ఇంటికి వెళ్లానని ఇక ఆ తర్వాత భయంతో ఆ రాత్రంతా చాలా ఏడ్చాను ఆ సంఘటన తన జీవితంలో అసలు మర్చిపోలేనని తెలియజేసింది అదొక చేదు విషయంగా మిగిలిపోయిందని తెలుపుతోంది తేజస్వి.

ప్రస్తుతం తమిళ్ తెలుగులో కూడా సినిమాలలో నటిస్తున్నానని తెలిపింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఈమెకు ఒక అవకాశం రావడంతో ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించి అవకాశాలను అందుకుంది. ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకుంది తేజస్వి మదివాడ.. ఇక కొద్ది రోజుల క్రితం నుంచి ఈ అమ్మడు వివాహం చేసుకోబోతోంది అంటు వార్తలు వినిపిస్తున్నాయి.