రాజకీయాలపై అలాంటి కామెంట్స్ చేసిన సుమన్..!

ప్రముఖ టాలెంటెడ్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు హీరోగా పలు అవార్డులను కూడా దక్కించుకున్న ఆ తర్వాత.. కొన్ని అనివార్య కారణాలవల్ల జైలు పాలయ్యారు.అయితే తన తప్పిదం లేదు అని కోర్టు కొట్టి పారేసినా కూడా సినిమాలలో అవకాశాలు లభించడం ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత ఆయన నిజాయితీ తెలుసుకొని కొంతమంది ఆయనకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

అలా విలన్ గా పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్న సుమన్ ఇటీవలే రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడుతూ.. హాట్ టాపిక్ గా మారుతున్నారు. తాజాగా రాజకీయాలపై మాట్లాడుతూ.. మరొకసారి షాకింగ్ కామెంట్లు చేశారు సుమన్. ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీ నే అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇకపోతే ప్రస్తుతం గౌడ కుల సంఘాల సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఈయన.. అప్పుడప్పుడు తన స్నేహితులను కలుసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రుకు వచ్చిన సుమన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించిన సుమన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే అన్ని వర్గాలకు ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైసిపి ప్రభుత్వం ఏర్పడుతుందని తన అభిప్రాయంగా వెల్లడించారు. ఇక అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరొకసారి వైసిపి వస్తుందని తనకు సమాచారం అందిందని కూడా తెలిపారు సుమన్. మొత్తానికైతే సుమన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.