పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టడం జరిగింది. జులై 4వ తేదీన ఎలుగెత్తు ఎదిరించు ఎన్నుకో జైహింద్ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ ను ఓపెన్ చేయడం జరిగింది.ఇలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారో లేదో ఫాలోవర్స్ సైతం భారీ గాని పెరిగిపోయారు. దీంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరడం జరిగింది. ఏ ఒక్క పోస్ట్ పెట్టకుండానే పవన్ కళ్యాణ్ ఇన్స్టాల్ మొదటిసారిగా ఇలాంటి రికార్డు సృష్టించడంతో పవన్ అభిమానులు మొదట ఎలాంటి పోస్ట్ షేర్ చేస్తారు అంటూ ఫాలోవర్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఒకవేళ మొదటి పోస్ట్ పెడితే పవన్ కళ్యాణ్ కు మాత్రం మరింత ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉందని కానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇన్స్టాల్ లో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన శృతిహాసన్, కీర్తి సురేష్ తదితర హీరోయిన్స్ సైతం పవన్ కళ్యాణ్ nut అనుసరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల షూటింగ్ మరొకవైపు వారాహి యాత్రతో బిజీగా ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఈనెల 28న చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించి బజ్ మాత్రం ఏర్పడలేదు. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాలు అప్డేట్లను సైతం విడుదల చేయక రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ మరి కలెక్షన్ల పరంగా ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇవే కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర విరమల్లు, ఓజీ తదితర చిత్రాలు ఉన్నాయి.