మద్యానికి బానిసై కెరీయర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్ ,డేటింగ్ పెళ్లి విడాకులు వంటివి ఎ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా విడాకుల వ్యవహారం మరింత ఎక్కువగా మారుతున్నాయని చెప్పవచ్చు. కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండగా కొన్ని కారణాల చేత వెనుకబడుతున్నారు. మరి కొంతమంది డ్రింక్ డ్రగ్స్ వంటి వాటికి ఆడెట్టు అయ్యి కెరియర్ ని నాశనం చేసుకుంటూ ఉన్నారు.

Manisha Koirala Talks About Finding A Life Partner At The Age Of 52,  Reveals Plans To Become A Mom

అలాంటి వారిలో హీరోయిన్ మనీషా కోయిరాల కూడా ఒకరు.. ఈ ఆమ్మడు జార్ఖండ్లో జన్మించింది.హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. 1991లో సౌదాగర్ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోలందరితో కూడా పలు చిత్రాలలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు బొంబాయి వంటి సినిమాలో నటించి సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జునతో క్రిమినల్, అర్జున్తో ఒకే ఒక్కడు కమల్ హాసన్ తో భారతీయుడు , బూచి తదితర చిత్రాలలో నటించింది.

మనిషా కొయిరాలా ఎంత మంచి పేరు తెచ్చుకుందో ఆమె కెరియర్ కూడా అంతే తొందరగా ముగిసింది. కెరియర్ ముగిస్తున్న సమయంలో నేపాల్ కు తిరిగి వెళ్లాలనుకుందట ..అయితే ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిస అయ్యి.. మద్యం సేవించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మద్యం మత్తులో ఉన్న మనిషాను మీడియా ప్రతినిధులు పలు రకాల ఫోటోలు తీస్తూ ఉండగా ఆమె వద్దని వేడుకొందట..కానీ మద్యానికి బానిస కావడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని తెలియజేసింది మనీషా కొయిరాలా. ఈమధ్యం వల్ల తన లైఫ్ తలకిందులైందని తన జీవితం ఇలా మారుతుందని తన కలలో కూడా అనుకోలేదని తెలియజేసింది. 2010లో మనీషా తన తోటి నేపాలి వ్యాపారవేత్త సామ్రాట్ వివాహం చేసుకుంది ఆ తర్వాత రెండేళ్లకి విడాకులు తీసుకోవడం జరిగింది.