సినిమాలకు దూరం కానున్న సమంత.. దానికి కారణమిదే

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఈ యాపిల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న తర్వాత చాలా కుంగిపోయింది సమంత. తన మకాం ముంబైకి మార్చేసింది. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడకు వెళ్లింది. అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా చేస్తోంది. ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమాలో ఆమె షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. సిటాడెల్ చిత్రీకరణ కూడా త్వరత్వరగా ఆమె కంప్లీట్ చేయనుందట. ఈ రెండూ పూర్తయిన తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉండనుందని తెలుస్తోంది.

సినిమాలకు దూరంగా ఉండాలనే సమంత నిర్ణయంతో ఆమె ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. అయితే వారికి ఊరటనిచ్చేలా అసలు విషయం తెలిసింది. కేవలం ఒక ఏడాది మాత్రం సినిమాలు చేయకుండా సమంత రెస్ట్ తీసుకోనుందట. ఇప్పటికే ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఆ బాధ పంటి బిగువున అనుభవిస్తూనే శాకుంతలం సినిమా చేసింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే దాని నుంచి బయటపడి తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న షూటింగ్స్ త్వరత్వరగా కంప్లీట్ చేసేస్తోంది. మయోసైటిస్ బారిన పడినప్పుడు ఆమె కోలుకుంటున్నా ఆ ప్రభావం ఇంకా ఉందని తెలుస్తోంది.


పూర్తిగా కోలుకుంటే వరుస ప్రాజెక్టులు ఒప్పుకుని మరిన్ని సినిమాలు ఆమె చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుందట. ఏదేమైనా ఆమె త్వరగా కోలుకుని తిరిగి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేయాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.