సౌత్ స్టార్ బ్యూటీ సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సమంత కూడా ఆల్మోస్ట్ ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేసేసింది. మయోసైటిస్ కారణంగా ఆమె అమెరికా వెళ్లబోతోంది. అక్కడ చికిత్స తీసుకోబోతోందని వార్తలు వచ్చాయి. ఇందుకోసమే సమంత తన చేతిలో ఉన్న ఖుషి మరియు సిటాడెల్ ప్రాజెక్ట్ లను త్వరత్వరగా కంప్లీట్ చేసింది.
విజయ్ దేవరకొండకు జోడీగా చేసిన ఖుషి సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అలాగే సిటాడెల్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించింది. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ రెండు ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన సమంత.. రేపే మాపో ఆమెరికా వెళ్లిపోతుందని అందరూ భావించారు.
కానీ, సమంత బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. చివరి నిమిషంలో ఆమె తన లాంగ్ టైమ్ డ్రీమ్ ను తీర్చుకోవడానికి అమెరికా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసింది. ఎన్నో ఏళ్లుగా ఓ రోడ్ ట్రిప్ వేయాలని సమంత కోరుకుంటుందట. ఆమెరికా వెళ్తే ఇప్పట్లో అది జరగదని భావించిన సమంత.. వెంటనే ట్రిప్ ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం సమంత తమిళనాడులో ఉన్న దేవాలయాలను సందర్శిస్తోంది. ఈ రోడ్ ట్రిప్ అయ్యాకే ఆమె అమెరికా వెళ్లి చికిత్స తీసుకోనుందని సమాచారం.