సంచలనంగా మారుతున్న రేణు దేశాయ్ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్టు పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపేల కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కాలికి బలమైన గాయాలు తగలడంతో ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఆ వీడియోలో తన కుడి పాదానికి చాలా పెద్ద గాయమైందని మూడు వెళ్లకు దెబ్బ తగిలిందని ఒక వేలు చాలా నలిగిపోయి గోరు బయటికి వచ్చేసిందని అంత బాధలోనూ నేను ఒంటరిగా సముద్రాన్ని ఆస్వాదిస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది.

Pawan Kalyan Wife Health News: Pawan Kalyan's ex-wife Renu Desai reveals  suffering from heart, health issues | - Times of India

ఇక ఈ వీడియో పాటలలో బ్యాగ్రౌండ్ కింద ఆగి ఆగి సాగి మేఘమే నన్ను తాకేనే అంటూ ఒక పాటను కూడా జత చేయడం జరిగింది. దీంతో తాజాగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన మళ్ళీ తెరమీదకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది హేటర్స్”వాడేమో ఇంకో పెళ్లి చేసుకుని సరదాగా జీవితం గడిపేస్తున్నాడు వాడిని నమ్ముకున్న మీరు మాత్రం ఇలా ఒంటరిగా భరిస్తున్నారు”అంటూ కామెంట్లు చేయడం జరిగింది.. మరి కొంతమంది కాలికి గాయం అయినప్పుడు ఉప్పు నీళ్లలో తిరగడం మంచిది కాదు అంటూ రేణు దేశాయ్ కు సలహాలు ఇస్తున్నారు.

మరి కొంతమంది రేణు దేశాయ్ పోస్టు పెట్టిన వాటికి బద్రి సినిమాలోని బంగాళాఖాతంలో పాట పాడితే బాగుంటుంది అంటూ చాలా వ్యంగాస్త్రాలు చేస్తున్నారు.. మరి కొంతమంది ఏమో రేణు దేశాయ్ ఆ పోస్ట్ పెట్టకపోతే పవన్ కళ్యాణ్ ని ఎవరు టార్గెట్ చేసేవారు కాదు కదా అంటే పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ పవన్ ఫ్యాన్స్ మధ్య ఈ విషయం చర్చనీయాంశంగా మారింది

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)