బాత్‌రూమ్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసిన రష్మిక.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది.

 

సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మిక మందన. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో ప్రేక్షకులను అలరిస్తూ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు,తమిళం తో పాటు హిందీలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉంటుంది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులను అలరించడానికి సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏకంగా బాత్రూంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. ఆ విషయాన్ని స్వయంగా రష్మికానే చెప్పింది. వాష్ రూమ్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ‘వాష్ రూమ్ లో మన క్రియేటివిటీ’ అంటూ రాసుకొచ్చింది. దాంతో బాత్రూంలో రష్మిక దిగిన ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఆ ఫోటోలు చూసి కొంతమంది ‘ నీకు ఫోటోలు దిగటానికి ఇంకా ఎక్కడ ప్లేస్ దొరకలేదు తల్లి..బాత్రూం లో దిగిన ఫోటోలను షేర్ చేసావు ‘ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మరికొంతమందేమో ‘సో క్యూట్ రష్మిక’ అంటూ కామెంట్  చేస్తున్నారు.