ఇన్‌స్టాగ్రామ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పోస్ట్.. ఒక్క వీడియోతో అంద‌రి మ‌న‌సులు దోచేశాడు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లె ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గతంలో ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ఉన్నాయి కానీ.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం లేదు. అయితే ఈ నెల ఆరంభంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పేరిట ఇన్‌స్టా అకౌంట్ ను ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వ‌చ్చిన వెంట‌నే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవ్వ‌డం షురూ చేశారు.

ఇప్ప‌టికే ఇన్‌స్టాలో ఆయ‌న్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 2 మిలియ‌న్లు దాటేసింది. అయితే అకౌంట్ ఓపెన్ చేసి రెండు వారాలు అవుతున్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఒక్క పోస్ట్ కూడా రాక‌పోవ‌డం అభిమానుల‌ను కాస్త నిరాశ ప‌రిచింది. కానీ, తాజాగా అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ప‌వ‌న్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫ‌స్ట్ పోస్ట్ పెట్టారు.

`మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ..` అని పేర్కొంటూ పవన్ క‌ళ్యాణ్ ఓ వీడియోను పోస్ట్ చేసి అంద‌రి మ‌న‌సులు దోచేశారు. రెండు నిమిషాల 40 సెక‌న్లు ఉన్న ఈ వీడియోలో ప‌వ‌న్‌ త‌న సినిమా జర్నీని ఆవిష్కరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, కృష్ణ‌ వంటి స్టార్ హీరోలతో అనుబంధం గుర్తు చేసుకున్నారు. అలాగే దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కమెడియన్స్ తో దిగిన ఫోటోల‌ను ఈ వీడియోలో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తుంది. ఈ వీడియోపై నెటిజ‌న్లు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)