నిత్యా మీన‌న్ ఇంట‌ తీవ్ర విషాదం.. అత్యంత ఇష్ట‌మైన వ్య‌క్తి దూరం కావ‌డంతో హీరోయిన్‌ భావోద్వేగం!

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీన‌న్ ఇంత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిత్యా మీన‌న్ కు అత్యంత ఇష్ట‌మైన వ్య‌క్తి దూరం అయ్యారు. ఆమె అమ్మ‌మ్మ తాజాగా క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ నిత్యా మీన‌న్ భావోద్వేగ పోస్ట్ పెట్టింది.

`ఒక శకం ముగిసింది. గుడ్‌ బై అమ్మమ్మ అండ్‌ మై చెర్రీ మ్యాన్‌. ఇకపై నీలోని ఇంకో కోణాన్ని చూస్తాము` అంటూ నిత్యా మీన‌న్ ఎమోష‌న‌ల్ అయింది. ఈ మేర‌కు అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌తో దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ పిక్ లో నిత్యా మీన‌న్‌ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని ఏదో విషయం చెబుతుంది వాళ్ల అమ్మమ్మ. ఈ ఫోటో వారి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది.

ఇక నిత్యా మీన‌న్ అమ్మ‌మ్మ మృతి చెంద‌డంతో.. ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలోనే ధైర్యంగా ఉండాలంటూ నిత్యా మీన‌న్ ను ఓదారుస్తున్నారు. కాగా, చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారిన నిత్యా.. త‌న‌దైన టాలెంట్ తో స్టార్ హోదాను అందుకుంది. గ్లామ‌ర్ షోకు దూరంగా ఉంటూ కేవ‌లం న‌ట‌నా ప్ర‌ధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ప్ర‌స్తుతం త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)