మెగా డాటర్ నిహారిక ఎట్టకేలకు చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పరస్పర అంగీకారంతో హైదరాబాద్లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇందుకోసం వీరు దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల క్రిందటే కోర్టు విడాకులు మంజూరు చేసింది.. ఇకపోతే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సినీ ఇండస్ట్రీలోనే కాదు అటు సోషల్ మీడియాలో కూడా వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. అంతే కాదు సోషల్ మీడియా ఖాతాల నుండి తమ ఫోటోలను, పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇరువురు డిలీట్ చేయడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది.
ఇక అప్పటినుంచి నిహారిక వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే మరొకవైపు చైతన్య జొన్నలగడ్డ మాత్రం ఇటీవలే యోగాశ్రమంలో చేరి మళ్లీ ఇంస్టాగ్రామ్ పోస్ట్లతో వైరల్ గా మారుతున్నాడు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. అంతేకాదు మెగా కుటుంబంలో జరిగిన అన్ని వేడుకలకు కూడా నిహారిక మాత్రమే హాజరు కావడం ఇప్పుడు చర్చకు మరింత దారి తీసింది. కానీ దీనిపై ఎవరు స్పందించలేదు. విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చినా సరే కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎట్టకేలకు ఈరోజు వీరిద్దరూ విడాకులు తీసుకొని వేరుపడినట్లు అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
ఇకపోతే నటుడు, నిర్మాత అయిన నాగబాబు కూతురు నిహారిక గుంటూరు ఐజి జే ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్ట్ లో నిశ్చితార్థం జరగగ.. 2020 డిసెంబర్లో రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఉన్న ఉదయ విలాస్ లో ఘనంగా వివాహం జరిగింది. కానీ ఇప్పుడు విడాకులు తీసుకొని ఈ జంట వేరుపడ్డారు.. ఇదిలా ఉండగా మరొకవైపు నిహారిక కొణిదెల విడాకుల పిటిషన్ కోసం ఆమె తరపున పనిచేసిన న్యాయవాది ప్రముఖ సోషల్ మీడియా వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సుంకర కావడం గమనార్హం.