50లోనూ ఇంత అందమా.. న‌మ్ర‌త లేటెస్ట్ పిక్స్ చూసి స్ట‌న్ అయిపోతున్న నెటిజ‌న్లు!

నమ్రతా శిరోద్కర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మాజీ మిస్ ఇండియా, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి అయిన న‌మ్ర‌త ప్ర‌స్తుతం గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని అన్యోన్య దంపతుల్లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త‌ జంట ఒకటి.

‘వంశీ’ సినిమాలో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం.. అది చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. వివాహం అనంత‌రం న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టేసిన న‌మ్ర‌త‌.. సంపూర్ణ గృహిణిగా మారింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. భ‌ర్త‌, పిల్ల‌ల‌ను చూసుకుంటూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న నమ్ర‌త.. మ‌హేష్ కంటే వ‌య‌సులో పెద్ద‌ది అన్న విష‌యం తెలిసిందే. మ‌హేష్ బాబు ఏజ్ 47 కాగా.. న‌మ్ర‌తకు 51 ఏళ్లు.

అయితే అందం విష‌యంలో మ‌హేష్ బాబు ఎంత కేర్ తీసుకుంటాడో.. న‌మ్ర‌త సైతం అంతే కేర్ తీసుకుంటుంద‌ని అన‌డానికి ఆమె తాజా ఫోటోలే నిద‌ర్శ‌నం. టీ ష‌ర్ట్ అండ్ ప్యాంట్ ధ‌రించి ఆల్ట్రా స్టైలిష్ అవతార్ లో న‌మ్ర‌త నెట్టింట ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆమె తాజా పిక్స్ చూసి 50లోనూ ఇంత అందమా అంటూ నెటిజ‌న్లు స్ట‌న్ అయిపోతున్నారు. కాలేజ్ గర్ల్స్ కి న‌మ్రత పోటీ ఇస్తుందంటూ చాలా మంది కామెంట్ల మోత మోగిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)