హీరోగా గౌత‌మ్ ఎంట్రీని క‌న్ఫార్మ్ చేసిన న‌మ్ర‌త‌.. కానీ చిన్న ట్విస్ట్‌!?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం అన్న సంగ‌తి తెలిసిందే. కుమారుడు గౌత‌మ్ కాగా.. కుమార్తె సితార‌. ఇప్ప‌టికే సితార సోష‌ల్ మీడియా ద్వారా అదిరిపోయే ఫోటూ షూట్లు, డ్యాన్స్ వీడియోల‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సర్కారు వారి పాట సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సితార.. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారింది.

ఈ జ్యువెల‌రీ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేస్తూ సితార న‌టించిన ఫ‌స్ట్ యాడ్ ను న్యూయార్క్ లోని టైమ్ స్వ్కేర్ పై ప్ర‌ద‌ర్శించ‌డంతో ఒక్కసారిగా ఆమె హైలైట్ అయింది. చిన్న‌త‌నంలోనే సితార దూకుడు చూసి.. ఖ‌చ్చితంగా ఆమె ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతుంద‌ని అనుకుంటున్నారు. మరి మ‌హేష్ బాబు వ‌ర‌సుడు గౌత‌మ్ సంగ‌తేంటి..? అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంది.

అయితే తాజాగా గౌత‌మ్ గురించి న‌మ్ర‌త ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో పీఎంజే జ్యువెలరీ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో న‌మ్ర‌త‌, సితార పాల్గొన్నారు. కొందరు మీడియా వారు గౌత‌మ్ ఫిల్మ్ ఎంట్రీ గురించి ప్ర‌శ్నించారు. అందుకు న‌మ్ర‌త గౌతమ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడ‌ని.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంద‌ని.. గౌతమ్ హీరో అవుతాడు.. కానీ ఆరేడేళ్లు సమయం పడుతుందని నమ్ర‌త వెల్ల‌డించింది. గౌత‌మ్ ఫోక‌స్ ఇప్పుడు స్ట‌డీస్ పైనే ఉంద‌ని పేర్కొంది. మొత్తానికి హీరోగా గౌత‌మ్ ఎంట్రీని క‌న్ఫార్మ్ చేసిన న‌మ్ర‌త‌.. అది ఇప్ప‌ట్లో మాత్రం ఉండ‌ద‌ని చివ‌ర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చింది. దీంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు.