పాపం వారు ఆ పనిచేయకుండా బతకలేరేమో: అనసూయ కాంట్రవర్షల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అల్లరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండితెర ప్రేక్షకులను మెప్పించింది. అలానే వెండితెర అవకాశాల కోసం జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అనసూయ ఒకవైపు కెరీర్ ని, ఇంకోవైపు ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది.

అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. గతంలో తనని ‘ఆంటీ’ అని పిలవద్దు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత విజయ్ దేవరకొండ కావాలనే అతడి ఫ్యాన్స్ తో తనని తిట్టిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసింది. ఆ విషయంలో విజయ్ అభిమానులు అనసూయకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దాంతో విజయ్ దేవరకొండ సినిమాలపై పొగడ్తల వర్షం కురిపించింది. ఇటీవలే తనని వివాదాల్లోకి లాగోదు అంటూ సోషల్ మీడియా లో విజ్ఞప్తి చేసింది.

తాజాగా అనసూయ ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చింది ‘వావ్! నేను మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ని. అందుకే నాతో పరిచయం ఉన్నా, లేకున్నా ఎక్కడ చూసినా నా పేరు వాడుకొని చర్చలో దిగుతున్నారు. మీ అందరికీ నేను ఎంత అవసరమో అబ్బాయిలు, మీరంతా నామీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. నా పేరు ఎత్తకుండా బతకలేరేమో’ అంటూ ఒక ఎమోజీని జత చేసింది. ఇది చూసిన అనసూయ అభిమానులు ‘మళ్ళీ ఏమైంది అను’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సంగతి ఏంటంటే ఇటీవలే ఒక హీరో కొత్త సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా, దానిపై అనసూయ స్పందించింది. దాంతో ఆ హీరో ఫ్యాన్స్ విపరీతంగా అనసూయని విమర్శిస్తున్నారు. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ ను కూడా కాంట్రవర్సీగా మారుస్తున్నారు.