టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఢిల్లీ భామగా మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో తన బోల్డ్ నెస్ తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. ఆ తర్వాత మాత్రం అదే రేంజిలో హిట్ సినిమా పడలేదని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో నటించిన తన గ్లామర్ తో ఆకట్టుకున్నప్పటికీ స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది.. పాయల్ కెరియర్ లో వెంకీ మామ, డిస్కో రాజా, RDX లవ్ తదితర చిత్రాలలో నటించింది.
ప్రస్తుతం ఈమె చేతిలో మంగళవారం, మాయ పేఠిక అనే చిత్రలు మాత్రమే ఉన్నాయి. తాజాగా పాయల్ రాజపుత్ ఇచ్చిన ఇంటర్వ్యులో టాలీవుడ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. పాయల్ మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత టాలీవుడ్ లో కొంతమంది తనను మిస్ గైడ్ చేశారని నేను నమ్మిన వాళ్ళే తనను అడ్వాంటేజ్ గా తీసుకొని వాడుకున్నారని తెలియజేస్తోంది. ఆ సినిమా వద్దు ఈ సినిమా చేయి అంటూ తనకు తప్పుడు సలహాలు ఇచ్చారని వారి వల్లే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందని తెలియజేసింది.
అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు అర్థమయిందని.. దీంతో వాళ్ళని దూరం పెట్టానని ఇప్పుడు తనకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిందని ఎలాంటి సినిమా చేయాలి ఏ సినిమా చేయకూడదు అని ఆలోచన వచ్చిందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో పాయల్ ని టాలీవుడ్లో తప్పుతావు పట్టించిన వాళ్ళు ఎవరా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.