అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్‌!

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనుష్క లేటెస్ట్ మూవీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` రిలీజ్ డేట్ లాక్ అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనుష్క, నవీన్ పొలిశెట్టి ఇందులో జంట‌గా న‌టించారు.

జయసుధ, మురళి శర్మ, నాజర్ త‌దిత‌రులు ఇర‌త ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తాజాగా మేక‌ర్స్ రిలీజ్ డేట్ ను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఆగ‌స్ట్ 4న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మేర‌కు మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

దీంతో అనుష్క శెట్టి ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. అనుష్క వెండితెర‌పై కనిపించి చాలా కాల‌మే అయిపోయింది. ఆమె ఆఖ‌రి చిత్రం నిశ్శబ్దం నేరుగా ఓటీటీలో విడుద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే అనుష్క‌ను లాంగ్ గ్యాప్ త‌ర్వాత స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఏజ్ గ్యాప్ ఉన్న జంట ప్రేమ‌క‌థ‌తో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో చెఫ్ పాత్ర‌లో అనుష్క‌శెట్టి, స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా న‌వీన్ పొలిశెట్టి క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి అందుకుంటుందో లేదో చూడాలి.