మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలె తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈయన సతీమణి ఉపాసన గత నెల 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్ చెప్పారు. అలాగే తమ లిటిల్ ప్రిన్సెస్ కు క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు.
ప్రస్తుతం ఈ దంపతులు తమ డార్లింగ్ తో టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ కు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఉపాసన డెలివరీ తర్వాత రామ్ చరణ్ మూడు నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వనున్నాడని.. తన పూర్తి సమయాన్ని భార్య, బిడ్డకే కేటాయించబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మెగా ఫ్యాన్స్ మరింత వైరల్ చేశారు. దాంతో రామ్ చరణ్ నిజంగా గ్రేట్, గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటూ అందరూ ఆయన్ను తెగ పొగిడేశారు.
కానీ, రామ్ చరణ్ మూడు నెలలు షూటింగ్స్ బ్రేక్ ఇవ్వడం అనేది ఉత్తుత్తి ప్రచారమే అట. అసలు అలాంటి నిర్ణయం ఆయన తీసుకోలేదు. మరో రెండు, మూడు రోజుల్లోనే `గేమ్ ఛేంజర్` షూటింగ్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ రెడీ అయ్యాడు. అలాగే ఈ నెలలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాను సైతం పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నాడట. దీంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. అనవసరమైన ప్రచారాలు చేసి రామ్ చరణ్ పరువు తీశారు కదరా అంటూ మెగా ఫ్యాన్స్ కి నెటిజన్లు చురకలు వేస్తున్నారు.