రాజ‌మౌళితో అంత వీజీ కాదు.. ఆ మూడు నెల‌లు మ‌హేష్ బాబుకు చుక్క‌లే అట‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఈ మూవీ అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో మ‌హేష్ బాబు ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు.

వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న తొలి సినిమా ఇది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ మూవీకి క‌థ అందిస్తున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం తెర‌పైకి వ‌చ్చింది.

మ‌హేష్ బాబుకు ఓ మూడు నెల‌ల పాటు రాజ‌మౌళి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇప్పించ‌బోతున్నాడ‌ట‌. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఇండియాలో కాకుండా ఆమెరికాలో ప్లాన్ చేస్తున్నార‌ట‌. సినిమా ప‌ట్టాలెక్క‌క‌ముందే మ‌హేష్ బాబుకు రాజ‌మౌళి చుక్క‌లు చూపించ‌బోతున్నాడ‌ని.. డిసెంబ‌ర్ లో ఆయ‌న ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ట్రైనింగ్ పూర్తైన త‌ర్వాత అంటే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో మ‌హేష్-రాజ‌మౌళి మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని టాక్ న‌డుస్తోంది. దీంతో రాజ‌మౌళితో అంత వీజీ కాదు.. మ‌హేష్ కు టార్చ‌ర్ స్టార్ట్ కాబోతోంది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.