పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న ఫాంటసీ చిత్రం బ్రో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉన్నారు.. నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంటనే హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిపించడం జరిగింది.ఈవెంట్ కు మెగా వారసులు వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్ కూడా అతిధులుగా రావడం జరిగింది.
ఈ పరిశ్రమ ఏ కుటుంబానికి చెందినది కాదు తన అన్నయ్య చిరంజీవి గారు కూడా ఎటువంటి అండదండ లేకుండానే ఒక చిన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా అయ్యారు. నన్ను కూడా హీరో అవుతావా అని అడిగారు.. నేను మాత్రం ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటా నేను హీరో అవ్వనని చెప్పారట.కానీ తనలోని కలను గుర్తించి మా వదిన తనను సినిమాలలో ప్రోత్సహించింది అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు..
ఆరోజు మా వదిన చేసిన తప్పు ఇవాళ మీ ముందు నన్ను నిలబడేలా చేసింది.. మా వదిన చేసిన ద్రోహం మాటలలో వర్ణించలేనిది అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.. హీరో అయ్యాక సినీ పరిశ్రమలో మా అన్నయ్య స్టార్ కదా అని పనిచేయడం మానలేదు అలాగే ఈ పరిశ్రమ అంతా మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలే అని ఎవరు ఫీల్ అవ్వలేదు.. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు.. మాలాంటి కుటుంబం నుంచి చిరంజీవి గారు రావడం మాకు ఎంతో ఆనందమని తెలిపారు.