హాట్‌గా మారిపోతున్న కీర్తి సురేష్… రీసెంట్ పిక్స్ చూశారా…

కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మహానటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు క్లాస్ గానే కాదు తనలోని మరో యాంగిల్ ను కూడా పరిచయం చేసింది కీర్తి. తాజాగా దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

తాజాగా తమిళంలో విడుదలైన మామన్నన్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడదల చేసారు. ఇక తెలుగులో కూడా కీర్తి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటించగా, నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిన దసరా సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో కీర్తి అదరగొట్టింది. మహానటి తరువాత కీర్తికి గుర్తింపు తెచ్చిన సినిమా దసరా అనే చెప్పాలి. హీరోయిన్ గానే కాదు కీర్తి ఏ క్యారెక్టర్ లో అయినా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇదివరకు రజినీకాంత్ చెల్లలిగా నటించిన కీర్తి ఇప్పుడు చిరంజీవి సిస్టర్ రోల్ లో కనిపించనుంది. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది.

సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా కీర్తి యాక్టీవ్ గా ఉంటుంది. వరుస హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కీర్తి షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కీర్తి చేతిలో ఆరు సినిమాలు ఉన్నటు సమాచారం. అంతేకాదు కీర్తి తన రెమ్యూనరేషన్ ని కూడా పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోకి కూడా కీర్తి వస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక కీర్తి పెళ్లి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే చాలా సార్లు కీర్తి పెళ్లి టాపిక్ వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ కూడా మారిపోయింది. తాజాగా దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.