సౌత్ లో స్టార్ హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కెరీర్ కాస్త డౌన్ అయినా.. దసరా చిత్రంతో బ్లాక్ బస్టర్ గా ఖాతాలో వేసుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఒక్కో సినిమాకుఇప్పుడు రూ. 5 కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న కీర్తి సురేష్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక దంపతుల కుమార్తె అయిన కీర్తి సురేష్.. 2000లో `పైలట్స్` అనే మలయాళ చిత్రంలో చైల్ట్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసింది.
ఈ సినిమాకు కీర్తి సురేష్ తల్లి మేనక స్వయంగా నిర్మించింది. అయితే ఈ మూవీలో నటించినందుకు గానూ కీర్తి సురేష్ కు రూ. 500 రెమ్యునరేషన్ గా ఇచ్చారట. అదే ఆమె ఫస్ట్ పారితోషికం అని ఇటీవల కీర్తి సురేష్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలా ఐదు వందల రూపాయిలతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన కీర్తి సురేష్.. ఇప్పుడు రూ. 5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.