టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి చిత్రం లో నటి హనీ రోజ్, నందమూరి బాలకృష్ణ కు జోడిగా నటించింది .అయితే ఈమె 2005లో ఒక మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం తెలుగులో వరుణ్ సందేశ్ తో 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ బాలయ్యతో నటించిన సినిమా మాత్రమే ఆమెకు మంచి సక్సెస్ ని తెచ్చి పెట్టిందనీ చెప్పవచ్చు. అయితే ఈ గ్లామర్ బ్యూటీ కి ఇటీవల కాలంలో ఆఫర్లు రావడం లేదనే విషయం సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.
కేవలం కొన్ని షాపింగ్ మాల్స్ ఈవెంట్లకు వెళ్లి అక్కడ అట్రాక్షన్ గా నిలుస్తోంది.జనాలు ఆమెని చూడటానికి ఎగబడుతున్నారు. ప్రేక్షకులలో అయితే హనీ రోజ్ కి స్పెషల్ క్రేజ్ పెరిగిందనే చెప్ప వచ్చు. ఈ అమ్మడికి క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు మాత్రం రావటం లేదు. అందుకు కారణం హనీ రోజ్ ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ.3 నుండి రూ.4 కోట్ల మధ్యలో రెమ్యునేషన్ అడుగుతోందట. కానీ నిర్మాతలు ఈమెకి ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వటానికి సిద్ధంగా లేరని సమాచారం. అయితే ఆమెకు ఒక కోటి రూపాయలైతే ఇవ్వటానికి మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో అయితే హనీ రోజ్ కి అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి అనిపిస్తోంది.. కానీ మలయాళం ఇండస్ట్రీలో ఈ అమ్మడికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో హానీ రోజ్ ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి మరి.