మహేష్, పవన్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లీక్ చేసిన హీరోయిన్లు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు హీరోయిన్లు బాగా పాపులర్ అవుతున్నారు. ఫాన్స్ ఆ హీరోయిన్స్ ని మేడం మీరు సూపర్ అంటూ కామెంట్స్‌తో వారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే అసలు ఆ హీరోయిన్స్ ఎవరు? ఎందుకు వారిని అంతలా పొగుడుతున్నారు? అని అనుకుంటున్నారా.. అసలు ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో ఎవరు ఉంటారు అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ విషయం గురించి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసింది మీనాక్షి చౌదరి. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో నటించడం నాకు చాలా ఆనందగా ఉంది. మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పింది. దాంతో పూజా ప్లేస్‌లో మీనాక్షి ఫిక్స్ అయిందనే విషయం పై క్లారిటీ వచ్చి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని పవన్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఎన్నికల పూర్తయ్యే వరకు ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలు లేవు అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో నిధి అగర్వాల్ పెట్టిన ఒక పోస్ట్ ఫ్యాన్స్‌కి కొత్త ఆశల్ని రేకెత్తించింది. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తుంది. ఇటీవల ఆమె, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. నన్ను నమ్మండి. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి రెడీగా ఉండండి అంటూ నిధి రాసుకొచ్చింది. దాంతో, మహేష్ ఫాన్స్, పవన్ ఫాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.