ఓటీటీ కంటెంట్ పై జెనీలియా షాకింగ్ కామెంట్స్..

హీరోయిన్ జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెనీలియా పేరు వినగానే అందరికి మొదట గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు. జెనీలియా ఎన్ని సినిమాలు చేసిన ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు ఏ సినిమా ఇవ్వదేమో. అప్పట్లో ఈ సినిమా ఒక క్లాసిక్. బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఢీ, ఆరెంజ్, సత్యం, హ్యాపీ, సై సినిమాల్లో నటించి స్టార్ అయ్యింది.

ఆ తరువాత బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత భర్తతో కలిసి కొన్ని హిందీ సినిమాల్లో కనిపించింది. పెళ్లి తరువాత ఇంటి భాద్యతలను తీసుకున్న జెనీలియా ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే జెనీలియా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. గత ఏడాది భర్తతో కలిసి మిస్టర్‌ మమ్మీ, వేద్‌ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే జెనీలియా ఓటిటిలో విడుదలయ్యే సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జెనీలియా నటించిన తాజా వెబ్ సిరీస్ ట్రయల్‌ పీరియడ్‌ జులై 21 నుంచి ఓటీటీ జియో సినిమా వేదికగా ప్రసారం కానుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్న జెనీలియా ఓటిటిలో వచ్చే సినిమాలపై కామెంట్స్ చేసింది. ఓటిటిలో వచ్చే సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నాము అంటూ కామెంట్స్ చేసింది. కుటుంబంతో కలిసి చూసే కథలు రావడం లేదని, పిల్లలతో కలిసి ఓటిటిలో సినిమాలు చూడలేకపోతున్నాము అని తెలిపింది. పూర్తి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే ఈ ట్రయల్‌ పీరియడ్‌ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపింది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడవచ్చని, తను నటించిన వేద్‌ సినిమా కూడా కుటుంబం అంతా కలిసి చూడవచ్చని ఈ సందర్భంగా చెప్పింది. అయితే ఇప్పుడు జెనీలియా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.