నిహారికకు రెండో పెళ్లి చేసినా విడాకులు తప్పవు… వేణుస్వామి సంచలన కామెంట్స్!

గత కొన్నాళ్లుగా చూసుకుంటే మెగా డాటర్ నిహారిక తన భర్త.. వెంకట చైతన్యతో విడిపోతున్నట్లు అనేకరకాలుగా వార్తలు నెట్టింట ప్రచారం జరిగాయి. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా హెదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో చైతన్య, నిహారికల విహహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ పెళ్ళికి నాగబాబు దాదాపు ఓ 50 కోట్లు ఖర్చు చేసినట్టు భోగట్టా. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఈ జంట ఒక్కటైంది. అయితే వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడంతో సోషల్ మీడియా కోడై కూస్తోంది.

వీరిద్దరి మధ్య మనస్పర్థాలు రావడానికి గల కారణం ముఖ్యంగా మెగా కుటుంబమే అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం ప్రతిదానికి మెగా ఫ్యామిలీని మధ్యలోకి లాగడం కరెక్ట్ కాదని, వివాహం అనేది పూర్తిగా రెండు మనసులకు సంబందించినది అని చెప్పుకొస్తున్నారు. ఇక మన సాంప్రదాయ వివాహాలలో ఒక పెళ్లి కుదిర్చినప్పుడు అమ్మాయి, అబ్బాయి జాతకం చూసి, ఇద్దరి జాతకాలు కలిస్తేనే పెళ్లి పెట్టుకుంటారు. అంతేకాకుండా వీరి జాతకాల ఆధారంగానే వివాహ ముహూర్తం కూడా నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుత సమాజంలో సంప్రదాయాలను పక్కనబెట్టి ఫొటోలకు, వీడియోలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సరైన సమయంలో జరగాల్సిన పెళ్లిళ్లు కాస్త అటుఇటుగా జరుగుతున్న పరిస్థితి.

సరైన ముహూర్తానికి పెళ్లిళ్లు జరగకపోవడం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయని పెద్దలు చెబుతూ వుంటారు. నిహారిక, చైతన్య విషయంలో కూడా ఇదే జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిహారిక పెళ్లి నిర్ణయించిన ముహూర్తానికన్నా చాలా లేట్‌గా జరిగిందని.. అందుకే తన జీవితం ఇలా అయ్యిందని.. కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అదే పెద్ద షాకింగ్ వార్త అనుకుంటే సినిమా జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ…. మెగా డాటర్ నిహారిక విడాకుల విషయం సంచలన వ్యాఖ్యలు చేయడం ఇపుడు పెనుదుమారాన్ని సృష్టిస్తోంది. విషయం ఏమంటే నిహారిక జాతకమే అలా ఉందని, ఆమెకి రెండో పెళ్లి చేసినా విడాకులు తప్పవు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.