స్టార్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అక్కడికి పిలిచి శారీ విప్పమన్న డైరెక్టర్!

ప్రముఖ సీనియర్ నటి హేమమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సీనియర్ నటి మాత్రమే కాదు, లోక్‌సభ సభ్యురాలు కూడా. ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న హేమమాలిని తన సినీ కెరీర్ కి సంబంధించిన ఒక విషయం గురించి తాజాగా మాట్లాడారు. హేమమాలిని గతంలో ఒక సినీ దర్శకుడి కారణంగా చాలా ఇబ్బంది పడ్డానని కామెంట్స్ చేసారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో సెట్లో అందరూ ముందు తాను కట్టుకున్న చీర పిన్ తీసేయమంటూ దర్శకుడు చెప్పడంతో ఆమె షాక్ అయ్యానని తెలిపారు.

సినీ ఇండస్ట్రీకి దూరమైన హేమమాలిని ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ కెరీర్ గురించి, ధర్మేంద్ర తో వివాహం, పిల్లలు వంటి ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి కూడా మాట్లాడారు.

హేమ మాలిని మాట్లాడుతూ ‘ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను నేనెప్పుడూ మర్చిపోలేను. ఆ సినిమా దర్శకుడు నాపై ఒక రకమైన సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నాడు. నిజానికి నాకు చీర పైటకు పిన్ పెట్టుకునే అలవాటు ఉంది. కానీ దర్శకుడు ఒక సీన్ జరిగే సమయంలో పైట పిన్ను తీసేయమని చెప్పాడు. పిన్ను తీసేస్తే పైట జారిపోతుందని నేను సమాధానం చెప్పాను. వెంటనే ఆ దర్శకుడు నాకు కావాల్సింది కూడా అదే అంటూ సమాధానం ఇచ్చాడు. అతను ఆ మాట అనగానే నాకు చాలా భయం వేసింది. ” అని ఆమె చెప్పారు.

ఇక ‘సత్యం శివం సుందరం’ అనే సినిమా ఆఫర్ మొదట హేమమాలినికే వచ్చిందట. కానీ ఆమె ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో వేరే వారు నటించారట. ఇక ఆ తర్వాత తన భర్త ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ ‘ఆయన మా కూతుర్లు ఇద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. కూతుర్ల పెళ్లి విషయంలో ఆయన చాలా కంగారు పడేవారు ‘ అనే తెలిపారు. హేమమాలిని,ధర్మేంద్ర ఇద్దరూ కలిసి షోలే, సీత ఔర్ గీత అనే సినిమాలో నటించారు. ఆ సమయం లోనే వారిద్దరూ ప్రేమలో పడి 1980 లో వివాహం చేసుకున్నారు.