నటాషా దోషి.. ఈ బ్యూటీ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `జైసింహా` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, హరిప్రియతో పాటు నటాషా దోషి కూడా హీరోయిన్ గా నటించింది. ఇందులో బాలయ్యతో కలిసి `అమ్మ కుట్టి` సాంగ్ లో అదరగొట్టింది.
ముంబైలో జన్మించిన నటాషా దోషి.. మలయాళంలో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. జైసింహా తర్వాత `కోతల రాయుడు` అనే మూవీలో మెరిసింది. ఆ సినిమా ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. సక్సెస్ లేకపోవడం వల్ల ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు రాలేదు. సినిమా సంగతి పక్కన పెడితే.. నటాషా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది.
తాజాగా ఎంటేజ్మెంట్ పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుని అందరినీ నటాషా సర్ప్రైజ్ చేసింది. మనన్ అనే వ్యక్తిని నటాషా పెళ్లి చేసుకోబోతోంది. `ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది` అనే క్యాప్షన్ తో నటాషా ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలను పంచుకుంది. దీంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకోబోతోందని స్పష్టమైంది. ఇక మరి కొద్ది రోజుల్లోనే ఈ ముంబైలో ప్రియసఖుడితో ఏడడుగులు వేయబోతోంది.
View this post on Instagram