పవన్ కళ్యాణ్ కి దూరంగా అన్నా లెజినోవా.. అసలేమైంది..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని అందులో ర ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన.. మూడవ భార్య రష్యాకు చెందిన అన్నా లెజినోవాతో జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని ఏళ్లుగా గా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా తోనే కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో ఆయన మూడో భార్య అన్నా కూడా దూరంగా ఉంటున్నట్లు ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె తన పిల్లలతో కలిసి సింగపూర్లో ఉంటున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య కి కూడా విడాకులు ఇవ్వబోతున్నారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా బాగా వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా ఆమె మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వేడుకల్లో కూడా కనిపించలేదు. అంతేకాదు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థం జరిగినప్పుడు ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ మాత్రమే హాజరయ్యారు. మిగతా మెగా కుటుంబ సభ్యులంతా కూడా తమ కుటుంబాలతో కలిసి వస్తే.. పవన్ కళ్యాణ్ సింగిల్ గానే వెళ్లడం అక్కడ ఆశ్చర్యానికి గురిచేసింది. మరొకవైపు రాంచరణ్, ఉపాసన దంపతులకు కూతురు పుట్టారు. బారసాల కూడా జరిపించారు.. అయినా కూడా ఆమె కనిపించలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విభేదాలు రావడం వల్లే అన్నా ఇకపై అతనికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యి సింగపూర్లో పిల్లలతో ఒంటరిగా ఉంటుందని సమాచారం. ఇక తుది నిర్ణయం వస్తే ఆమె రష్యాకు మకాం మార్చాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పూర్తి విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.