ఆంధ్రాలో కూడా అల్లు అర్జున్ భారీ మల్టీప్లెక్స్ థియేటర్.. ఎక్కడంటే..?

తెలుగు హీరోలంతా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండడమే కాకుండా మరొకవైపు బిజినెస్ పరంగా కూడా తమ సత్తా చాటుతూ ఉన్నారు. అలా ఎన్నో రకాలుగా బిజినెస్ లతో కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్ ,బిజినెస్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఇలాంటి వాటికే ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఏషియన్ గ్రూప్ తో కలిసి నిర్మించిన AAA మల్టీప్లెక్స్ని లాంచ్ చేసిన సంగతి తెలిసింది..

Allu Arjun gets mobbed by fans as he arrives for the launch of AAA Cinemas  - Hindustan Times

మొదట ఆది పురుష్ చిత్రాన్ని ఇందులో ప్రారంభించారు. ఇక ఈ థియేటర్ బాధ్యతలు అన్నీ కూడా అల్లు అర్జున్ సన్నిహితులు చూసుకుంటున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే మరొక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ గా మారుతోంది.అల్లు అర్జున్ విశాఖపట్నంలో ఒక భారీ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విశాఖలోని సాగర తీరప్రాంతంలో ఏడెకరాల స్థలం కొన్నట్లుగా టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తీరం వెంబడి ఉన్న ప్రాంతంలో అత్యధిక ప్రైమ్ ఏరియాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇస్కాన్ టెంపుల్ మరో రెండు స్టార్ హోటల్స్ దగ్గర ఈ స్థలం కొన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోని అక్కడ ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మించే ప్లాన్లు ఉన్నట్లు సమాచారం. అక్కడ కూడా AAA పేరుతోనే నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్లో అల్లు అరవింద్ సొంతగా ప్లీజ్ తీసుకున్న థియేటర్లు కూడా చాలానే ఉన్నాయి. ఎప్పటినుంచో వాటి నిర్వహణ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోని అభివృద్ధిలో ముందంజలో ఉన్న విశాఖపట్నం ఊహించిన అల్లు అర్జున్ సొంతంగా మల్టీప్లెక్స్ ని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది