న‌వ‌దీప్ తో వివాదం.. అందుకే సినిమాల‌ను వ‌దిలేశానంటూ సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన అంకిత‌!

హీరోయిన్ అంకిత గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లాహిరి లాహిరి లాహిరిలో` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. త‌న‌దైన అందం, అభిన‌యంతో అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో `సింహాద్రి` మూవీతో న‌టించి.. ఇండ‌స్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీతో అంకిత ద‌శ తిరిగిన‌ట్లే అని అంతా అనుకున్నారు.

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అంకిత ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక‌పోయింది. 2009 త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించ‌ని అంకిత‌.. 2016లో విశాల్ జగ్తాప్ అనే వ్య‌క్తిని పెళ్లాడి అమెరికాలోని న్యూ జెర్సీ లో స్థిరపడింది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అంకిత‌.. అనేన సంచ‌ల‌న నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది. సినిమాల‌ను వ‌దిలేయ‌డానికి కార‌ణం ఏంటో కూడా వివ‌రించింది. బాలకృష్ణ నటించిన `విజయేంద్ర వర్మ` పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాన‌ని.. ఆ సినిమా తర్వాత పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయని అనుకున్నాన‌ని, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింద‌ని అంకిత గుర్తు చేసుకుంది.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఉంటేనే కెరీర్ బాగుంటుంద‌ని.. విజయేంద్ర వర్మ హిట్ అయ్యుంటే తాను ఇండ‌స్ట్రీలో ఉండేదాన్ని, కానీ అలా జ‌ర‌గ‌లేదు.. అందుకే సినిమాలు వ‌దిలేశానంటూ అంకిత పేర్కొంది. ఇక నవదీప్ తో అంకిత‌కు గొడవ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విష‌యంపై కూడా ఆమె స్పందించింది. న‌వ‌దీప్‌కు, త‌న‌కు మ‌ధ్య‌ ఎలాంటి గొడవలు లేవ‌ని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇండ‌స్ట్రీలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. అయితే వారిద్ద‌రూ ఇప్పుడు లేర‌ని అంకిత్ తెలిపింది.