వరుణ్ తేజ్, లావణ్య విషయంలో అక్షర సత్యమైన వేణు స్వామి మాటలు..??

సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను స్టార్ సెలెబ్రేటీలు అయిన సమంత, నాగచైతన్యలు పెళ్ళి చేసుకోడానికి ముందే వారిద్దరూ కొన్నేళ్ల తరువాత విడిపోతారని చెప్పాడు. ఆ సమయంలో వేణు స్వామిపై విమర్శలు వెళ్లువెత్తాయి. కానీ నాగ్, సామ్ లు వివాహం చేసుకున్న నాలుగేళ్ళకే విడిపోవడంతో వేణు స్వామి చెప్పిందే జరిగింది అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా రామ్ చరణ్, ఉపాసనలు లేట్ గా తల్లితండ్రులు అవుతారని కూడా ముందే చెప్పాడు వేణు స్వామి.

ఇలా వేణు స్వామి చెప్పినవి ఆలస్యంగా అయినా నిజం అవుతున్నాయి. దాంతో వేణు స్వామి మాటలు నమ్మేవారు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు. ఇక 2023 లో ప్రభాస్ జాతకం ఘోరంగా ఉంటుందని వేణు స్వామి చెప్పారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిపై విరుచుకుపాడుతున్నారు. అలానే ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ యువ హీరో మరణిస్తారని చెప్పారు. అతను చెప్పిన విధంగానే ఇటీవలే తారకరత్న మరణించారు. డైరెక్ట్ గా తారకరత్న చనిపోతాడని చెప్పకుండా టాలీవుడ్ హీరో చనిపోతాడని చెప్పాడు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారని వేణు స్వామి చెప్పారు. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 9న వీరి నిశ్చితార్ధం ఘనంగా జరగబోతుందని సమాచారం. ఇలా టాలీవుడ్ లోని వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారని వార్తలు రావడంతో వేణు స్వామి చెప్పిన జోతిష్యం మరోసారి నిజం అవుతుంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.