మరో మల్టీప్లెక్స్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వెంకటేష్, మహేష్.. ఎక్కడంటే..

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకోవైపు యాడ్స్‌లో నటిస్తూ సొమ్ము వెనకేసుకుంటున్నారు. కొంతమంది హీరోలయితే సినిమా లో, యాడ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కొత్త బిజినెస్‌లు మొదలు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోలు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌ని ప్రారంభించాడు. రీసెంట్‌గా అల్లు అర్జున్ ఎషియాన్ సినిమాస్ వారితో చెయ్యి కలిపి మల్టిప్లెక్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్‌ని మొదలుపెట్టెందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ బిజినెస్‌లోకి రాబోతున్న మరో ఇద్దరు స్టార్ హీరోలు మరెవరో కాదు విక్టరీ వెంకటేష్, రానా. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడట. ఈ ముగ్గురు హీరోలు కలిసి మల్టిప్లెక్స్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆర్టీసి క్రాస్ రోడ్డులో దేవి 70 ఏఎం అనే ఫేమస్ థియేటర్ ని మల్టీప్లెక్స్ థియేటర్ గా మార్చబోతున్నట్లు సమాచారం. దేవి 70 ఏఎం థియేటర్ ని ఇప్పటికే కొనుగోలు చేసినట్లు ఎషియాన్ సునీల్ తెలిపారు. త్వరలోనే దానిని నూతన సాంకేతిక టెక్నాలజీ తో మల్టీప్లెక్స్ గా తీర్చిదిద్దబోతున్నట్లు సునీల్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మహేష్ బాబు, రానా, వెంకటేష్ అండ్ స్టార్ హీరోలు ఏషియన్ సునీల్‌తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ ని నిర్మించడం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఇక కొత్తగా రాబోతున్న ఈ మల్టీప్లెక్స్ కి ఏఎంబి విక్టరీ అనే పేరుని పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.