వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ దిగ్గజ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి.. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినా ఆ తర్వాత విలన్ రోల్స్ కు కేరాఫ్ గా మారింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ తో పాటు సహాయక పాత్రలు పోషిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.
అలాగే ఇటీవల వరలక్ష్మి పలు లేడీ ఓరియెంటెడ్ కథలకు కూడా కమిట్ అయింది. చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న వరలక్ష్మి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా బయటపెట్టింది. `నా గొంతు గంభీరంగా చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. అయితే కెరీర్ ఆరంభంలో చాలా మంది నా గొంతును వెక్కించారు.
మగాడి గొంతులా ఉంది. హీరోయిన్స్ కి ఉండాల్సిన గొంతా? అది అంటూ దారుణంగా అవమానించారు. కొన్ని సినిమాలకు నన్ను డబ్బింగ్ చేపేందుకు కూడా అనుమతించలేదు. ఆ టైమ్ లో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. పట్టుబట్టి మరీ నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేశా. ఏదైతే మైనస్ అన్నారో.. అదే నాకు ప్లస్ అయింది. ఇప్పుడు నా నటనతో పాటు నా గొంతుకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు` అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.