టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన ఈమె.. తన జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అందుకోసం తనకు నచ్చని సినిమాలలో కూడా నటించానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కీర్తి సురేష్ కెరియర్ లో మహానటి సినిమా ది బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈమె పాత్ర నటనకు ప్రశంసలు అందాయి. నిజంగానే సావిత్రి మళ్ళీ వచ్చి నటించిందా అన్నట్లుగా కీర్తి సురేష్ తన నటనతో అబ్బురపరిచింది. కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించింది అనే కంటే ఆమె ఈ సినిమాలో జీవించిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ అవార్డు కూడా అందుకున్నది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కు వరుస అవకాశాలు వెలుపడ్డాయి. మహానటి సినిమా తరువాత ఆరు నెలలుగా కీర్తి సురేష్ కాళీగా ఉందట ఎలాంటి ఆఫర్లు రాకపోవడంతో వచ్చిన కొన్ని ఆఫర్లను మహిళ ఆధారిత సినిమాలే వచ్చాయట.దీంతో తను ఆర్థికంగా చేతిలో డబ్బు లేకపోవడంతో నిలదొక్కుకునేందుకు పలు సినిమాలలో నటించానని తెలిపింది.
కానీ ఇప్పుడు పరిస్థితి దాదాపుగా చెక్కదిద్దుతుందని తనకు కథ నచ్చితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది కీర్తి సురేష్. దీంతో కీర్తి సురేష్ కూడ ఆర్థిక ఇబ్బంది కూడా ఎదురయిందా అంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. దీంతో కొన్ని సినిమాలు చేయవలసి వచ్చిందని తెలియజేసిన కీర్తి సురేష్ ఆ సినిమా పేర్లను మాత్రం తెలియజేయలేదు. కానీ కీర్తి
సురేష్ కెరియర్లో పెంగ్విన్ ,మిస్ ఇండియా తదితర సినిమాలు కూడా ఓటీటి లో విడుదలై పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.