సేమ్ స్టోరీతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన రవితేజ, మహేష్ సినిమాలు.. ఏవంటే..

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అప్పుడప్పుడు ఒకే రకం స్టోరీ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్ హీరోల కెరీర్లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గతంలో వీరిద్దరూ ఒకే స్టోరీ ఉన్న సినిమాలో నటించారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలా ఒకే స్టోరీ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన రెండు సినిమాలు బ్లాక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు అనే సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమా లో మహేష్ బాబు కి జంటగా భూమిక హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించాడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ ఎం.ఎస్ రాజా నిర్మించిన ఈ సినిమా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఒక్కడు ‘సినిమా సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ఇంచుమించు సేమ్ స్టోరీతో ఒక రెండు ఏళ్ళ తరువాత రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సేమ్ స్టోరీతో రవితేజ వచ్చిన సినిమా ‘భద్ర ‘. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకి జంటగా మీరాజాస్మిన్ నటించింది. అలానే ఈ సినిమాకి కొరటాల శివ డైలాగ్స్ రాశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

నిజానికి ఈ రెండు సినిమా స్టోరీలు ఒకే రకంగా ఉంటాయి. రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ ఫ్యామిలీకి దూరమవుతుంది. ఆ తరువాత హీరోయిన్ తీసుకెళ్లి హీరో తన ఇంట్లో ఉంచుతాడు. అంతేకాకుండా రెండు సినిమాల్లో కూడా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, విలన్ నుంచి హీరోయిన్ హీరో కాపాడటం, ఎయిర్ పోర్ట్ నుండి చాలా సన్నివేశాలు ఒకేలా ఉంటాయి. దీన్నిబట్టి చూస్తే ఒకే రకమైన స్టోరీతో ఇద్దరు హీరోలు ప్రేక్షకులకు ముందుకు వచ్చి మంచి విజయం అందుకుని, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టారు.