తప్పు చేసి ఉంటే క్షమించండి.. వైరల్ గా మారిన రష్మీ పోస్ట్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్ద ఎత్తున తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదట సీరియల్ నటుడు అంబటి అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. కానీ అదే సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షక ఆదరణ లభించకపోవడంతో సుడిగాలి సుదీర్ నీ రంగంలోకి దించారు మల్లెమాల యూనిట్ . ఇక అప్పటినుంచి ఈ కార్యక్రమానికి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది.

Rashmi Gautam to shake a leg in Chiranjeevi Bholaa Shankar

అయితే సినిమాలలో బిజీ కావడం వల్ల సుదీర్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి రష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇకపోతే రష్మీ యాంకరింగ్ చేస్తున్న ఈ షో ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరించి ఏడాది కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెకు రకరకాలుగా వీడియోలు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోని రష్మీ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

రష్మీ ఆ పోస్టులో ఇలా రాసుకుంది.. ప్రతి ఆదివారం నాకు ఎంతో స్పెషల్ అవుతుంది .. ఎందుకంటే ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి ప్రేక్షకులు మంచి ఆదరణను అందిస్తున్నారు . ఈ కార్యక్రమం అందరికీ నచ్చిందని తెలిసి నేను కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇలాగే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే.. లేదా తప్పు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ ఈ సందర్భంగా ఆమె అభిమానులను కోరుతూ ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.