పెళ్లి త‌ర్వాత భార్యతో శ‌ర్వానంద్ ఫ‌స్ట్ ట్రిప్‌.. ఇంత‌కీ ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లిస్ట్ లో నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ బ‌ట‌య‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె శ‌ర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ ఏడ‌డుగులు వేశాడు.

జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శ‌ర్వా, ర‌క్షిత‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. జూన్ 9వ తేదీన హైద‌రాబాద్ లో శ‌ర్వానంద్ వెడ్డింగ్ రిసెప్ష‌న్ జ‌ర‌గ‌గా.. ఈ వేడుక‌కు టాలీవుడ్ మొత్తం క‌దిలి వ‌చ్చి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించింది. ఇక‌పోతే పెళ్లి త‌ర్వాత భార్య ర‌క్షిత శ‌ర్వానంద్ ఫ‌స్ట్ ట్రిప్ తిరుమ‌ల‌కు వేశారు.

ఇవాళ స‌తీస‌మేతంగా శ‌ర్వానంద్ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అలాగే శ్రీ‌వారి అభిషేకం సేవ‌లో పాల్గొన్న కొత్త దంప‌తులు.. స్వామి వారికి ప్ర‌త్యేక పూజాలు చేశాను. అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అందుకుని.. వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈ జంట హ‌నీమూన్ కోసం విదేశాలు వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. కాగా, శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది.