దానివల్లే ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మాస్టర్‌.. బయటపడ్డ షాకింగ్ నిజం..

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చలాకీగా మాట్లాడుతూ మొన్నటిదాకా అలరించాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఇతను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వయసులోనే కన్నుమూశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ నేర్పిన ఈ కొరియోగ్రాఫర్ 1,500 సినిమాలు పైగా పని చేశాడు. ఇప్పుడు నంబర్ వన్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ వద్ద ఓనమాలు దిద్దినోడే. అలాంటి గొప్ప కొరియోగ్రాఫర్ అయిన రాజేష్ మాస్టర్ చివరిలో మాత్రం ముక్కు సూటితనంగా మాట్లాడుతూ విమర్శల పాలయ్యాడు.

అయితే కొంతమందిని ఆగ్రహానికి గురిచేసినా మరికొంత మందిని తన కామెడీతో రాకేష్ మాస్టర్ బాగా నవ్వించాడు. వారం రోజుల క్రితం కూడా ఈ డ్యాన్సర్ శ్రీకాకుళం జిల్లాకి వెళ్లి సునిషిత్, స్వాతి నాయుడు, అగ్గి పెట్టె మచ్చాలతో కలిసి ఫన్నీ యూట్యూబ్ ప్రోగ్రామ్ “మ్యాన్షన్ హౌస్” చేశాడు. ఈ ప్రోగ్రామ్‌ ప్రేక్షకులను బాగా నవ్వించింది. అయితే అతను ఎండాకాలంలో వేడి వాతావరణం తట్టుకోలేక ఉపశమనం కోసం మద్యం అతిగా సేవించడం మొదలుపెట్టాడు. అప్పటికే రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతున్నాడు. డాక్టర్లు కూడా ప్రాణాలకు ముప్పు ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అయినా రాకేష్ మాస్టర్ ఇటీవల కాలంలో బాగా ఎంజాయ్ చేశాడు. ఇష్టమొచ్చినట్లు తాగేసాడు. బయట ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్ కడుపులో కుక్కేసాడు. సినీ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, రెండు రోజుల క్రితం రాకేష్ 20 బాటిళ్ల ఆల్కహాల్ తాగాడు. అది చాలదన్నట్టు అసురక్షితమైన ఆహారం చాలా ఎక్కువగా తిన్నాడు. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయింది. అతని శరీరంలోకి పాయిజన్ ఎక్కువగా వెళ్లడం వల్ల పరిస్థితి విషమంగా మారింది. అదే సమయంలో అతను మండే ఎండలో ఎక్కువసేపు తిరిగాడు. ఇది వడదెబ్బకు దారితీసింది. ఒకవైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు అతిగా ఆల్కహాల్ తాగడం, ఇంకోవైపు వడదెబ్బ వల్ల రాకేష్ మాస్టర్ తట్టుకోలేకపోయాడు. చివరికి అతడు తనువు చాలించాడు.