మ‌హేష్ ఫ్యాన్స్ కి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన రాజ‌మౌళి.. పాపం ఇది అస్స‌లు ఊహించుండ‌రు!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం రాజమౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్ బాబుతో చేయ‌బోతున్న‌ట్లు ఏడాదిన్నర క్రిత‌మే అనౌన్స్ చేశాడు. అడ్వెంచర్ యాక్షన్ మూవీ ఇది.

దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే నిజానికి ఈ ఏడాది ఆరంభంలోనే మ‌హేష్‌-రాజ‌మౌళి మూవీ ప్రారంభం అవుతుంద‌ని అన్నారు. స‌మ్మ‌ర్ కూడా అయిపోతోంది. ఇంత‌వ‌ర‌కు ఈ మూవీ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని వార్త‌లు రావ‌డంతో.. మ‌హేష్ ఫ్యాన్స్ కాస్త ఖుషీ అయ్యారు.

కానీ, ఇంత‌లోనే రాజ‌మౌళి దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. అదేంటంటే.. ఇంత‌వ‌ర‌కు ఈ సినిమా క‌థ కంప్లీట్ కాలేద‌ట‌. రాజమౌళి ప్ర‌తి సినిమాకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ క‌థ అందిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే మహేష్‌ బాబు సినిమాకు ఇంకా కథ రాసే పని పూర్తి కాలేదట. క‌థే పూర్తి కాలేదంటే.. స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా అయ్యుండ‌దు. ఇవ‌న్నీ కంప్లీట్ చేసి సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లాలంటే రాజ‌మౌళికి మ‌రో ఆరేడు నెల‌లు స‌మ‌యం ప‌ట్ట‌డం ఖాయ‌మంగా క‌నిపిస్తోంది. అంటే రాజ‌మౌళి, మ‌హేష్ మూవీ ఈ ఏడాది ప్రారంభం కావ‌డం క‌ష్ట‌మే అని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా రాజ‌మౌళి నుంచి మ‌హేష్ ఫ్యాన్స్ ఈ షాక్ ను అస్స‌లు ఊహించుండ‌రు.