న‌ల్ల‌గా ఉన్నావంటూ వేధింపులు.. బాడీ షేమింగ్ కామెంట్స్‌పై నోరు విప్పుతూ ఇచ్చిప‌డేసిన‌ ప్రియ‌మ‌ణి!

జాతీయ అవార్డు గ్ర‌హీత ప్రియ‌మ‌ని గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ‌లో ప్రియ‌మ‌ణి ఒక‌టి. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ప్రియ‌మ‌ణి ముస్తఫా రాజ్ అనే వ్య‌క్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ముస్తఫా రాజ్ కు అప్ప‌టికే ఒక పెళ్లి జ‌రిగింది. అత‌నికి మొదటి భార్యతో ఇప్పటికీ వివాదం నడుస్తుంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. పెళ్లి త‌ర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ సెకెండ్ ఇన్సింగ్స్ ను షురూ చేసింది.

సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. మ‌రోవైపు బుల్లితెర‌పై ప‌లు టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి త‌న‌పై వ‌చ్చే బాడీ షేమింగ్ కామెంట్స్ పై నోరు విప్పుతూ ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేసింది. తాను కెరీర్ ఆరంభం నుండి బాడీ షేమింగ్ కామెంట్స్ కి గురవుతూనే ఉన్నాన‌ని.. చాలా మంది న‌ల్ల‌గా ఉన్నావంటూ వేధించేవార‌ని ప్రియ‌మ‌ణి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కొంద‌రు మీ ముఖం తెల్లగా ఉంది, కానీ మీ కాళ్ళు నల్లగా ఉన్నాయ‌ని కామెంట్లు చేసేవారు.

అయితే కెరీర్ ఆరంభంలో వాటి గురించి బాధ‌ప‌డ్డా.. ఆ త‌ర్వాత మాత్రం ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌ని, నేను అందంగా ఉన్నానని నేను నమ్మాను అంటూ ప్రియ‌మ‌ని పేర్కొంది. ఖాళీగా ఉండేవాళ్లే అలాంటి కామెంట్స్ చేస్తార‌ని.. అయినా నా లైఫ్ నా ఇష్ట‌మ‌ని ఆమె తెలిపింది. ఇక వేరే మతం వ్యక్తి అయిన ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకున్న‌ప్పుడు ఎంతో మంది ట్రోల్ చేశారు.. ట్రోల్స్ ను అస్స‌లు ప‌ట్టించుకోను.. నేను ఎవరితో జీవించాలనేది పూర్తిగా నా వ్య‌క్తిగ‌తం అంటూ ప్రియ‌మ‌ని వెల్ల‌డించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.