టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ ,పవన్ కళ్యాణ్, ప్రభాస్ తదితర హీరోలు సైతం ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో స్టార్ హీరోల పైన రెమ్యూనరేషన్ పైన పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది.. నిన్నటి రోజున కోనసీమ జిల్లాలో ముమ్మిడివరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొలిటికల్ స్పీచ్ పరంగా టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారని కొంతమంది తనతో చెప్పారని తెలిపారు.. సినిమా అనేది వినోదం ఆనందం నాకు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ అల్లు అర్జున్, రామ్ చరణ్ ,చిరంజీవి, బాలకృష్ణ ఇలా ప్రతి ఒక్కరి పైన చాలా గౌరవం ఉంది.. నేను వారందరి సినిమాలు చూస్తూనే ఉంటాను.. మేమందరం ఎదురుపడితే కచ్చితంగా మాట్లాడుకుంటాము సినిమాలపరంగా హీరోల మీద ఇష్టాన్ని రాజకీయాలలో చూపించకండి అంటూ తెలియజేశారు. సినిమాలు వేరు రాజకీయం వేరు.. సినిమాల పరంగా మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన మాట మాత్రం వినండి అంటూ తెలియజేశారు.
అంతేకాకుండా ప్రభాస్, మహేష్ నా కంటే పెద్ద హీరోలు వీరు పాన్ ఇండియా హీరోలు నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు.. చరణ్ ,ఎన్టీఆర్ అయితే గ్లోబల్ స్థాయికి ఎదగడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వీలు తెలియని వారంటూ ఎవరూ లేరని తెలిపారు.ఇలాంటి విషయాలు చెప్పడానికి తనకు ఎలాంటి ఇగో లేదని నేను కూడా సగటు మనిషి బాగుంటే చాలని కోరుకునే వ్యక్తిని.. కులాలపరంగా మనలో మనం గొడవపడితే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. స్టార్ హీరోల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.