టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రీజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నా సరే వాటిని పక్కన పెట్టి మరీ నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.
మరోవైపుసోషల్ మీడియా వేదికగా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా తన జీరో సైజ్ అందాలతో అందర్నీ అట్రాక్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే తాజాగా తన బాయ్ ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ముంబైలో జరిగిన ప్రముఖ నిర్మాత మధు మంతెన వివాహానికి హాజరైంది.
ట్రెండీ క్యాజువల్ లో హాట్ షో చేసింది. బ్రా లాంటి బ్రౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ ప్రియుడితో కలిసి ఫోటో గ్రాఫర్లకు పోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు సిగ్గులేదా రకుల్ అంటూ మండిపడుతున్నారు. చివరకు పెళ్లిలో కూడా స్కిన్ షోతో రెచ్చిపోతున్నావా అంటూ ఏకేస్తున్నారు. ఏదేమైనా రకుల్ తాజా పిక్స్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో పాలు ప్రాజెక్ట్ లను టేకప్ చేసిన రకుల్ కోలీవుడ్ లో `ఇండియన్ 2`, `ఆయలాన్` వంటి చిత్రాల్లో నటిస్తోంది.